ఖరీఫ్ సాగుకు రైతుబంధు నిధులు వెంటనే విడుదల చేయాలి.

వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు బంధు నిధులు వెంటనే రైతు ల ఖాతాలలో జమ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు పిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తైలం శంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేయలేదని వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని  డిమాండ్ చేశారు మే నెలలోనే నిధులు విడుదల చేయాల్సి ఉండగా జూన్ నెల ముగియ వస్తున్న విడుదల చేయలేదని విమర్శించారు ఖరీప్ పంటల సాగుకు రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని రైతుబంధు నిధులు వారి ఖాతాల్లో వేయటం తక్షణం అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డి యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు నందిమల్ల చంద్రమౌళి కొత్తకోట మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరోత్తం రెడ్డి పట్టణ నాయకులు వెంకటేష్ మదనపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సత్యశీల రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవుల రమేష్ నాయకులు శివ శంకర్ వెంకటేష్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి పలువురు యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు