గంగారంతండాలో పూరిల్లు దగ్దం * 2లక్షల మేర ఆస్తి నష్టం * బోరున విలపిస్తున్న బాధిత కుటుంబం

జూలూరుపాడు, జులై 4, జనంసాక్షి: మండల పరిధిలోని గంగారంతండా గ్రామానికి చెందిన ఇస్లావత్ తులసిరాంకు చెందిన పూరిల్లు ఆదివారం అర్థరాత్రి దగ్ధమైంది. తులసిరాం తన కుటుంబంతో కలిసి అదే గ్రామంలో ఉన్న దగ్గరి బంధువు ఇంటికి వెళ్లారు. రాత్రి వేళ సుమారు 11:00 గంటల సమయంలో పూరింట్లో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందటంతో ప్రమాదానికి కారణం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంతలోనే కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల మేర నష్టం జరిగినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో పూరిల్లుతో పాటు ఇంట్లోని వస్తువులు అన్నీ కాలి బూడిద కావడంతో బాధిత కుటుంబం బోరున విలపిస్తుంది