గడపగడపకు నిరంజన్‌ ప్రచారం

 

వనపర్తి,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం పల్లెలు, తండాల్లో ఊపందుకుంది. జిల్లాలోని పెద్దమందడి మండలం దొడ్డగుంటపల్లి గ్రామం కొత్తకుంట తండాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక జానయ్య పొలంలో వేసిన వేరుశనగ పంటలో నిరంజన్‌రెడ్డి.. దంతె కొట్టారు. గడప గడపకు తిరిగి టీఆర్‌ఎస్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి నిరంజన్‌రెడ్డి వివరించారు.