గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతులు పొందాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
గుడిహత్నూర్ ఆగస్టు 28 (జనం సాక్షి) మండల పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసుకొని మండపాల అనుమతులు పొందాలి గుడియాత్నూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించదలచినవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు ఉత్సవాలను భక్తితో శాంతియుత వాతావరణం లో జరుపుకునేందుకు కమిటీలు శ్రద్ధ చూపాలని కోరారు కమిటీ ఏర్పాటు అనంతరం ఆయా గ్రామ పంచాయతీల ద్వారా అనుమతి తీసుకోవాలని మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి కూడా తప్పనిసరిగా పొందాలని సూచించారు విద్యుత్తు కనెక్షన్ కోసం విద్యుత్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి డీజే సౌండ్ మరియు మైకుల ఏర్పాటు కోసం పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని తెలిపారు మండపాల వద్ద డిజె సౌండ్ సిస్టం లో బూర గొకుట్ట మైకులకు అనుమతి లేదని కేవలంరెండు సౌండ్ బాక్స్ లకు మాత్రమే అనుమతి పొందాలని తెలిపారు రాత్రి 10 గంటల తర్వాత గణేష్ మండపాల దగ్గర మైక్ సౌండ్లు బాక్సులు మరియు వివిధ రకాల సౌండ్లు పెట్టకూడదని తెలిపారు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా మండలపాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారుఈ నైపథ్వంలో ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాల ఏర్పాటు కోసం ముందస్తుగా పోలీస్ శాఖ తగు సమాచారం అందించి అనుమతులు పొందిన తర్వాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలి కోరారు ఆన్లైన్ అప్లికేషన్ మీసేవ లేదా ఈ సేవ రసీదు విద్యుత్ శాఖ పర్మిషన్ లెటర్ స్థల యజమాని అనుమతి గ్రామపంచాయతీ పర్మిషన్ పత్రాలను పోలీస్ స్టేషన్లో అందజేసి అనుమతి తీసుకొని కమిటీ పేరు నమోదు చేసుకోవాలి అనంతరం గణేష్ మండపం వద్ద మందస్తు జాగ్రత్తగా చర్యలు భాగంగా వాటర్ డ్రమ్ములను ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు గణేష్ విగ్రహం వద్ద రాత్రి సమయంలో ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు