గద్వాల రూరల్ జూన్ 13 (జనంసాక్షి):- ప్రజావాణి కార్యక్రమాని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు.. వివిధ గ్రామాల నుంచి 06 ఫిర్యాదులు రాగ జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు పిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని ఆయా సర్కిల్ అధికారులకు, ఎస్సై లకు సూచించారు. సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా పిర్యాదు దారులకు సూచించారు. -సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు ఒక ప్రకటనలో తెలిపారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి అంతర్జాతీయ  కంపెనీల పేరుతో గాని ,ఇతర పేర్లతో గాని ఫ్రీ గా ఏవైనా వస్తువులు ఇస్తామని మీ ఫోన్ లకు   వచ్చే మెస్సేజ్ లను  ప్రజలు నమ్మవద్దు అని అన్నారు. ఫోన్ లకు వచ్చే అనుమానాస్పదంగా కనిపించే బ్లూ లింక్ లను ఓపెన్  చేయవద్దు అని, మరియు   లాట్రీ  తాకిందనో, బహుమతి గెలుచుకున్నారనో లేదా డబ్బులు రేటింపు అవుతాయనో వచ్చే మెస్సేజ్ లను ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని అన్నారు. ఎవరైనా మోసపోయామని గ్రహిస్తే వెంటనే 24 గంటల లోపు సైబర్ క్రైమ్ జాతీయ హెల్ప్ లైన్ నెం- 1930  కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు. పిర్యాదు చేసే సమయం లో ఫోన్ నెం తో పాటు ఖాతా నెం, బ్యాంక్ పేరు, వాలెట్ పేరు, అకౌంట్ నెం,యూపిఐడి నెంబర్లు మొదలైన వివరాలు ఇవ్వాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు చొప్పున సైబర్ వారియర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా మోసపోయామని గ్రహించిన వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెం కు సమాచారం అందించి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు….