గాంధీ జయంతి సందర్భంగా మహిళల పూజలు

g93iqug9
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ, మహిళ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సహస్రగళార్చానం, త్రిలక్షపారాయణం జరిగింది. శుక్రవారం వనస్థలిపురంలోని స్వరుషి గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పప్పు పద్మ ప్రసన్నకుమార్‌ స్వరకల్పనలో బచ్చులక్ష్మీ ఆధ్వర్యంలో రామనామపారాయణం, హనుమాన్‌చాలీసా, తారక మంత్రాలు పఠించారు. 1000 మందికిపైగా స్త్రీలు పాల్గొన్న కార్యక్రమాన్ని రికార్డుగా గుర్తిస్తూ గోల్డెన్‌ స్టార్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఫోరం ధ్రువీకరణ పత్రం అందించింది.