*గురుకుల ఎంపికైన రేడియంట్ స్కూల్ విద్యార్థిని.* *కరస్పాండెంట్ అంజి రెడ్డికి ఘన సన్మానం.*

5.వ తరగతి కి జరిగిన గురుకుల ఎంట్రెన్స్ పరీక్షలలో రేడియంట్ స్కూల్ విద్యార్థి గహన శ్రీ గురుకుల విద్యాలయనికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు రేడియంట్ స్కూల్ కరస్పాండెంట్ అంజి రెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన గురుకుల విద్యాలయాలకు  మొన్న జరిగిన ఎంట్రన్స్ లో గహన శ్రీ అనే అమ్మాయి మంచి మెరిట్ ద్వారా సీట్ సంపాదించి గురుకులకు సెలెక్ట్ కావడం జరిగింది.ఈ విద్యార్థికి కరస్పాండెంట్ అంజిరెడ్డి గారు ఉచితంగా విద్యను అందిచండం జరిగింది. మంచి మెటీరియల్ అందించి స్పెషల్ తరగతులు నిర్వహించడంలో ఉపాధ్యాయ బృందానికి తగిన సూచనలు,సలహాలు ఇస్తూ మార్గదర్శనం అందివ్వడం జరిగింది, కరస్పాండెంట్ అంజి రెడ్డి గారు సామాజిక సేవలో కృషికిగాను కొంత మంది పేద విద్యార్థులకు  రేడియంట్ స్కూల్ లో ఉచితంగా విద్యను అందిస్తూ వారికి సహాయం అందిస్తూ పేద విద్యార్థులకు న్యాయం చేయడంలో వారి కృషి అభినందనీయమని విద్యార్థి తల్లిదండ్రులు శాలువ,పులమలతో కరస్పాండెంట్ అంజి రెడ్డి,ప్రిన్సిపాల్ బాల్ రెడ్డి గార్ల  సన్మానం చేయాడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు చెన్నప్ప,పద్మ,విద్యార్థి సంఘ నాయకులు బండారి వెంకటేష్,సురేష్,వినయ్,బాబు   పాటశాల సిబ్బంది దామోదర్,జ్యోతి ,చందన తదితరులు పాల్గొన్నారు.