గొర్రెలకు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన.ఎంపీపీ జ్యోతి.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.జీవాల పెంపకం దారులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నట్టలా నివారణ మందులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ లకుమళ్ళ జ్యోతి అన్నారు.శుక్రవారం మండలంలోని ముకుందాపురం గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు, ఉచిత నట్టల నివారణ మందులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పశువైద్యాధికారి రవి నాయక్ మాట్లాడుతూ 1153 గొర్రెలకు, 207 మేకలకు,మొత్తం 1360 జీవాలకు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సైదులు,గొర్రెల పెంపకందారుల  అధ్యక్షులు లింగయ్య, వి.ఎల్.ఓ నరసింహ చారి,సిబ్బంది రాందాస్,భాస్కర్,స్వప్న,గోపాల మిత్రలు రామయ్య,సైదులు, భుజంగరావు,సాయి కృష్ణ తదితరులు ఉన్నారు.