గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద మూడు గ్రాముల కొకైన్‌, 5.491 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల మత్తుమందును గుర్తించారు. దీంతో నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌ అవిూర్‌పేట కు చెందిన శబరీష్‌గా గుర్తించారు. కాగా, గచ్చిబౌలికి చెందిన లోకేశ్‌ చంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడిరచారు.