: గ్రామాల్లో ఆట పాటలతో కళాజాత అవగాహన
జనంసాక్షి (జూలై 14) : జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని పోకలగూడెం, మంగయ్య బంజర్ గ్రామాల్లో కళాజాత నిర్వహిస్తూ పలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంలో కళాజాత టీమ్ లీడర్ వెంకన్న మాట్లాడారు.పరిసరాల పరిశుభ్రత, మన ఊరు-మన బడి,హరితహారం కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆట పాటలతో ఆకట్టుకుంటూ సమాచారాన్ని చేరవేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు ఇస్లావత్ నిరోషా’ సునీత, జి పి సెక్రటరీలు శైలజ, ప్రసాద్,కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.