: గ్రామాల్లో ఆట పాటలతో కళాజాత అవగాహన

జనంసాక్షి (జూలై  14) : జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో  గురువారం  మండలంలోని పోకలగూడెం, మంగయ్య బంజర్ గ్రామాల్లో  కళాజాత నిర్వహిస్తూ పలు కార్యక్రమాలపై  ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంలో కళాజాత టీమ్ లీడర్   వెంకన్న మాట్లాడారు.పరిసరాల పరిశుభ్రత, మన ఊరు-మన బడి,హరితహారం కార్యక్రమాలపై  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో విస్తృతంగా   అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆట పాటలతో  ఆకట్టుకుంటూ సమాచారాన్ని చేరవేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు  ఇస్లావత్ నిరోషా’ సునీత, జి పి సెక్రటరీలు శైలజ, ప్రసాద్,కళా బృందం సభ్యులు  పాల్గొన్నారు.