గ్రామీణ కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి

 పరిగి రూరల్ , అక్టోబర్ 8( జనం సాక్షి  ) :
 గ్రామాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలాంటి వారిని  పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా  పరిగి మండలం చిట్యాల గ్రామంలో శనివారం టీఆర్ఎస్ ( బీఆర్ఎస్ ) పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలో టిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
  టీఆర్ఎస్( బీఆర్ఎస్) పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను పార్టీ కార్యాలయంలో ప్రజలందరికి తెలియజేస్తూ వారిని మరింత చైనత్య వంతులను చేయాలన్నారు. చిట్యాల గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్, నాయకులు బేతు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రవి కమార్ , మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
08 పిఆర్ జి 01లో పరిగి మండలం చిట్యాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, తదితరులు