ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

బూర్గుంపహాడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో

బూర్గంపహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కేంద్రంలో బి బ్లాకు మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి అధ్యక్షతన మాజీ ప్రధాని భారత మహిళా తొలి ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బార్లనాగమణి మాట్లాడుతూ
ఉక్కు మహిళ, నారి శక్తిని ప్రపంచానికి తెలియ జేసిన వీరవనితని, గరిభీ హటావో దేశ్కే బచావో అనే నినాదంతో తన పాలనలో పేదరికాన్ని నిర్మూలించిన తల్లీ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్బంగా ఘననివాళులు అర్పించారు. కూడు గూడు గుడ్డ లేని కోట్ల మంది భారత ప్రజానీకానికి భూములను పంచి, పట్టాలతో కూడిన ఇండ్లను కట్టించి భారత ప్రజల హృదయాలలో ఇందిరమ్మగా పేరొందిన గొప్ప వనవతావాది ఇందిరా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యం, పుట్టి లక్ష్మి, నాగలక్ష్మి వెంకటరమణ, రమేష్, సత్యనారాయణ, రామచంద్రయ్య, ఎస్కే మైబు తదితరులు పాల్గొన్నారు.