ఘనంగా కాపు సంక్షేమ సేన ఆవిర్భావదినోత్సవ కార్యక్రమం
ఎల్బీ నగర్ ( జనం సాక్షి ) మాజీ పార్లమెంట్ సభ్యులు , మాజీ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ చెగొండి హరిరామ జోగయ్య గారు నాయకత్వం లొ నడుస్తున్న కాపు సంక్షేమ సేన ఆవిర్భావదినోత్సవ కార్యక్రమం ఎల్ బి నగర్ హైదరాబాద్ లో కన్నుల పండుగ గా తెలంగాణ కాపు సంక్షేమ సేన అద్యక్షుడు శ్రీ యం.యేసు బాబు అధ్యక్షతన జరిగినది. ఈ మీటింగ్ లో కాపు సంక్షేమ సేన కార్య నిర్వాహక అద్యక్షులు డా బూరగడ్డ శ్రీనాధ్ , గంధం లక్ష్మి సత్య సేకర కాపు సంక్షేమ సేన వెల్పెర్ విన్గ్ అద్యక్షుడు ఆకుల రమణ మూర్తి , తెలంగాణ కాపు సంక్షేమ సేన ప్రదానకార్యదర్శి అడపా ఉదయ భాస్కర రావు గారు, మరియు సుదీర్ కర్ణా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈకార్యక్రమము ఎల్ బి నగర్ నియోజక వర్గ కన్వీనర్ విజయ రంగా గారి ఆద్వార్యములో జరిగినది. ఈకార్యక్రమములో సంఘ సేవకులను సత్కరించినము. ఈకార్యక్రమములో ఉమ మహేశ్ వర ‘ దివాకర్ మరియు ప్రసాద్ ,మండలి అప్పరావు , దివేశ కుమార్ ,లక్ష్మీ దుర్గ , వెంకట లక్ష్మీ ,అనురాద కాపు మహిళలు మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు. కాపు సంక్షేమ సేన కుటుంబ సభ్యులందరికి ఆవిర్భావదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
