ఘనంగా కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మండల కేంద్రంలో గురువారం నాడు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల మధ్య ఘనంగా జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న పసునూరు యుగేందర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో వారి విలువైన సేవలు ప్రజలకు అందించాలని ఆశిస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పట్టణ ప్రజలతోపాటు పరిసర ప్రాంత ప్రజలు అభిమానులు శ్రేయోభిలాషులు భారీ ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు కేకులు కట్ చేసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, గుమ్మడవల్లి గ్రామ సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, మాడుగుల యాదగిరి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, రావుల సత్యనారాయణ, గిరి శేఖర్ గౌడ్  టిఆర్ఎస్ యువజన నాయకులు లింగం యాదవ్, పంగ జానకి రాములు, పరమేష్ యాదవ్, నరేష్ తదితరులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు