ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి.

జనం సాక్షి ఉట్నూర్.

భారతరత్న గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ని ఉట్నూరు మండలంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పురస్కరించుకొని ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జావిద్ మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగిన గొప్ప శాస్త్రవేత్త మిస్సైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యువతకు మార్గ నిదర్శకుడని జీవితాంత దేశ ప్రతిష్ట కోసం తపించి దేశానికి కావలసిన ఎన్నో మిస్సైల్ లను తయారుచేసి ఒక మిస్సైల్ మ్యాన్ గా దేశం కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి పృథ్వీరాజ్ గ్రామ ఉపసర్పంచ్ నేదునూరి అశోక్ బాపురావు మడవి ఇస్రో షఫీ దేవ్ రావు సతీష్ ఇబ్రహీం ఆయ్యుబ్ ఇమ్రాన్ జుబెర్ పెరోజ్ కైలాష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.