ఘనంగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు కోదాడ టౌన్ జూన్ 13 ( జనంసాక్షి )

రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ జన్మదినం సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి బడుగుల లింగయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేసిన అనంతరం స్థానిక శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థలో అనాధ ఆశ్రమ పిల్లలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగుల లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలోపేతమవుతుందని రానున్న రోజుల్లో వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అందుకుని ప్రజాసేవలో బడుగు బలహీనవర్గాలకు సేవ చేసేందుకు వారు  ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, కౌన్సిలర్ కల్లూరి పద్మజా,గ్రంథాలయ చైర్మన్ రహీం,ఖదీర్ పాష, సంపేట ఉపేందర్ గౌడ్,వెంపటి మధుసూదన్,వంశీ,రాయపూడి వెంకటనారాయణ, గుండెల సూర్యనారాయణ,ఎండి ఇమ్రాన్,మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్,గంధం పాండు,భత్తుల ఉపేందర్,రాధాకృష్ణ ,పోటు రంగారావు,చింతల నాగేశ్వరరావు, ముస్తఫా,మహిళా నాయకురాలు మాధవి,విజయ,తాళ్లూరి లక్ష్మి, సుధా రెడ్డి,వీర కుమారి తదితరులు పాల్గొన్నారు.