ఘనంగా రాణి రుద్రమ సంస్మరణ దినోత్సవం

నకరేకల్‌ మలడలంలోని చందుపట్ల గ్రామంలో కాకతీయ రాణి రుద్రమ దేవి మరణం వివరాలు తెలిపే అరుదైన శిలా శాసనం వద్ద సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ జి, రామకృష్ణ ప్రత్యేకాధికారి శివనాగిరెడ్డి మాట్లాడుతూ శిలా శాసన ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాణి రుద్రమ కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రామ  వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో చరిత్ర పరిశోధకుడు సూర్యకుమార్‌, మహాత్మాగాంధీ యానివర్శిటీ రిజిస్ట్రార్‌ పోజన్న పాల్గొన్నారు.