ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

జూలూరుపాడు, జులై 8, జనంసాక్షి: కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల్లో గుర్తుండి పోయాయని అన్నారు. రుణమాఫీ, ఉచిత వైద్యం, పోడు భూములకు పట్టాలు, ఫీజు రీయంబర్స్మెంట్, రైతుల రుణాలు మాఫీ, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి పలు పథకాల ద్వారా వైయస్సార్ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వైరా ఎ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, మండల ఎస్టీ సెల్ నాయకులు వాంకుడోతు కిషన్ నాయక్, యూత్ ప్రెసిడెంట్ గుగులోతు శ్రీను, బాదావత్ సామ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు