చందుపట్ల చెరువు అభివృద్ధికి కోటిన్నర: కేసీఆర్

 62sth0m2నల్గొండ : జిల్లాలోని చందుపట్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే నకిరేకల్‌ నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు బహుమతిగా ఇస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా చందుపట్లలో శనివారం సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 11వ శతాబ్దంలోనే వాటర్‌ షెడ్‌ పథకాలను కాకతీయ పాలకులు ప్రపంచానికి పరిచయం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 102 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చందుపట్ల చెరువుకు 55 లక్షల నిధులు సరిపోవన్న కేసీఆర్‌.. అదనంగా 1.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. చందుపట్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు