చలో మునుగోడు

అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.
      అచ్చంపేటఆర్సీ,సెప్టెంబర్20,(జనం సాక్షిన్యూస్) :-అచంపేట నియోజకవర్గ  పరిధిలో వివిధ గ్రామాల నుండి ,మండలాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మునుగోడు కు తరలి వెళ్లారు. మునుగోడు గడ్డ, బహుజనల అడ్డ. మునుగోడు ఉపఎన్నిక లో గెలుపే లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ రథసారథి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో విడత బహుజన రాజ్యాధికారంలో భాగంగా, మునుగోడు లోని ప్రతి ఇంటిని ,ప్రతి గుండెను, తట్టడానికి జరుగుతున్న  యాత్రను జయప్రదం చేయడానికి అచ్చంపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధమై గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి వెళ్లడం జరిగింది. .అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన  కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ యోసెఫ్, జిల్లా అధ్యక్షులు నాగన్న ,జిల్లా నాయకులు ఆంజనేయులు మండల కన్వీనర్లు ఏకలవ్య, మన్యం రాము, కనేటి వెంకటయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area