చిన్న వర్షంతో ఐదు విద్యుత్ స్తంభాల నుండి తెగిపడ్డ కరెంటు వైర్

జైనథ్ జనం సాక్షి డిసెంబర్ 12 జైనథ్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో ఆదివారం నాడు రాత్రి పది గంటల సమయంలో చిన్నపాటి వర్షం కురిసింది దానితో ఐదు స్తంభాల నుంచి మెయిన్ లైన్ కిందపడి పోయింది కరెంటు తో స్తంభం కాలిపోయింది కరెంటు లేక లక్ష్మీపూర్ గ్రామంలో సెల్ ఫోన్స్ నీళ్ల అవస్థలు ఏర్పడ్డాయి నాణ్యమైనటువంటి విద్యుత్ పని చేయకపోవడం వలన నాణ్యమైన వైరు స్తంభాలు వేయకపోవడం వలన మాటిమాటికి లక్ష్మీపూర్ మెయిన్ లైన్ వైర్లు కింద పడిపోతున్నాయి రోడ్డుకి పక్కనే ఉన్న మెయిన్ లైన్ ఇలా నాసిరకమైనటువంటి పనులు చేయడం వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాత్రి సమయంలో పంట పొలంలో పోయేవాళ్లు కరెంటు వైర్ చూడక కింద పడి ఉన్న కరెంటు వైర్లతో ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు అని గ్రామస్తులు భయభ్రాంతులను చెందుతున్నారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు నాణ్యమైనటువంటి వైర్లు స్తంభాలు వేసేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.