చెరువు కట్టపై తాత్కాలిక మరమత్తులు

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 5:
హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని గాగిరెడ్డిపల్లె గ్రామం నుండి ఇందుర్తి కి వెళ్లే సంగోజిపేట చెరువు కట్టపై తాత్కాలిక మరమ్మత్తుల కార్యక్రమం సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేసి దగ్గరుండి 150 ట్రాక్టర్ ట్రిప్పులు మొరం పోయించారు. ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ సన్నిల్ల వెంకటేశ్, ఉప సర్పంచ్ అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎంపీపి అందే సుజాత, తెరాస మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య,నాయకులు ఆకుల మొగిలి,అందె పోశయ్య, ఎస్ కె సిరాజ్ పాషా, కల్వల సంపత్ రెడ్డి, కార్యదర్శి సురేశ్ పాల్గొన్నారు. నిత్యం పాఠశాలలకు,కళాశాలలకు వెళుతున్న విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తును రైతులను దృష్టిలో పెట్టుకొని గుంతలుగా ఏర్పడినటువంటి కట్టపై మొరం పోయించినందుకు గాగిరెడ్డిపల్లె, ఇందుర్తి రెండు గ్రామాల ప్రజలుతో పాటు వినాయక మండపాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.