జడ్చర్లలో పోలీసుల తనిఖీలు

మహబూబ్‌నగర్‌,మే23( జ‌నం సాక్షి):  జడ్చర్లలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఉదయం నాలుగు గంటల నుంచి తనిఖీలు చేపట్టారు. పోలీసుల సోదాలలో 22 బైక్స్‌, మూడు ఆటోలను సీజ్‌ చేయగా.. 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్టన్‌ సెర్చ్‌ నిర్వహిస్తామని ఎస్‌పి అనురాధ తెలిపారు. సోషల్‌ విూడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని.. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు.