జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతను అభినందించిన ఐజి నాగిరెడ్డి.

బూర్గంపహాడ్ జూలై 17(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం
జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ను ఐ జి నాగిరెడ్డి అభినందించారు. గోదావరి వరదలు నేపథ్యంలో బందోబస్తు నిర్వాహణ లో భాగంగా మండల కేంద్రానికి విచ్చేసిన ఐ జి నాగిరెడ్డి, ఖమ్మం సి పి విష్ణు వారియర్ రోడ్ మార్గాన వెళ్తూ మార్గ మద్యలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ని కలిసి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే దగ్గర నుంచి వారి బాగోగులు చేసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు జడ్పీటీసీ శ్రీలత ని అభినందించారు.