జనగామ మైనార్టీ కాలనీ లోని నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం చేసిన – నియోజకవర్గ కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి

జనగామ మైనార్టీ కాలనీ లోని నిరుపేద కుటుంబనికి ఆర్థిక సహాయం చేసిన  – నియోజకవర్గ  కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి
 జనగామ (జనం సాక్షి)రూరల్ జూన్10:పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ముందుకు సాగుతున్న వైఎస్ఆర్టిపి ,పార్టీ అధినేత్రి ఆదేశాలతో   గడప గడప వైఎస్ఆర్ టిపి ప్రోగ్రాం  విస్తృతంగా   కొనసాగుతున్న విషయం చాలా సంతోషంగా ఉందని  జనగామ జిల్లా వైఎస్సార్ టి పి అధ్యక్షుడు గౌరవబోయిన సమ్మయ్య, జనగామ నియోజకవర్గ  కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి    తెలిపారు. జనగామ జిల్లాలో వైఎస్సార్ టిపి తరఫున జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటు ముందుకు సాగుతోందని ఇప్పటికే పదిమందికి సాయం చేశామని ఇకముందు కూడా చేస్తామని వైఎస్సార్ టిపీలో షర్మిల సీఎం అయ్యే వరకు పదవులు ఆశించకుండా ప్రజాసేవకే అంకితం అవుతామని తెలిపారు.జనగామ జిల్లాలో 14వ వార్డ్ లోని మైదారి ఎలేంద్రకు జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ చేవెళ్ల స్వామి  ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది .ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తామని రాజశేఖర్ వారసురాలిగా ముందుకు వచ్చిన షర్మిలకు సీఎం అయ్యేదాకా గ్రౌండ్ వర్క్ చేస్తామని తెలిపారు ఈకార్యక్రమంలో  పట్టణ అధ్యక్షురాలు చెప్పాల వసంత ,పట్టణ అధ్యక్షుడు వెంకటరత్నం, బచ్చన్నపేట అధ్యక్షుడు శ్రీకాంత్ ,సుధా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.