జనగామ రెండో వార్డులో హరితహారం.

జనగామ (జనం సాక్షి )జూలై19:జనగామ జిల్లా కేంద్రంలోని రెండో వార్డులో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్ పర్సన్ పోకల జమున పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి మొక్కలను కూడా మన పిల్లల లాగే రోజు మూడు పూటల నీళ్లు పోసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని తెలిపారు. వృక్షో రక్షితి రక్షితః రెండో వార్డు కౌన్సిలర్ అనిత వాంకుడోత్ మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కాలుష్యం పెరగకుండా ఆక్సిజన్ అందరికీ అందే విధంగా ప్రతి ఇంటికీ తప్పకుండా ఆరు మొక్కలు నాటాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఏఈ బిక్షపతి వార్డు అధ్యక్షులు అంజయ్య జనరల్ సెక్రటరీ నర్సింలు, యువజన అధ్యక్షులు శైలేష్ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ రవి ఎస్సీ సెల్ అధ్యక్షులు సునీల్ ఆర్ పి జ్యోతి ,ఆశా వర్కర్ మనోహర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.