జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు

నల్గొండ : రామన్నపేట వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ బోగీలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై సమాచారమందించడంతో రైల్వే అధికారులు బోగీని పరిశీలించారు. బ్రేక్‌లైనర్‌ పట్టివేయడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.