జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఛానల్ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకోవాలి

 ! టీయూడబ్ల్యూజే  (ఐ  జే యూ) జిల్లా ఉపాధ్యక్షులు బూర రమేష్ గౌడ్ కార్యవర్గ సభ్యులు ఏ గోళం రవీందర్ గౌడ్ m గణపురం (ము) జూలై 17) జనం సాక్షి) : జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం 10టీవీ ఛానల్ యాజమాన్యం అన్ని విధాల ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులు బూ ర రమేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ గోళం  రవీందర్ గౌడ్ లు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని చానల్ యాజమాన్యాన్ని కోరారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీసేందుకు జగిత్యాలలో విధినిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన జమీర్ (39) జర్నలిస్ట్ కుటుంబాన్ని కి ప్రభుత్వం ఆర్థిక సహాయం  ప్రకటించి తక్షణమే ఆదుకొని, జమీర్ కుటుంబాన్నికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. 10 టీవీ ఛానల్ యాజమాన్యం జమీర్ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలన్నారు. మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు.