జీహెచ్‌ఎంసీ కైవసానికి సర్వశక్తులొడ్డాలి

5

మంత్రులతో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌3(జనంసాక్షి): త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీని మేయర్‌ పదవి దక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులను కోరారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో మధ్యాహ్నం నుంచి సుధీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు పద్మారావు, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్‌ పాల్గొన్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పెషల్‌ ఆఫీసర్‌ సోమేశ్‌ కుమార్‌ లతో సీఎం కేసీఆర్‌ సవిూక్ష జరిపారు.