జూనియర్ కరాటే లో సత్తా చాటిన సాయి అక్షిత్

పినపాక నియోజకవర్గం జూన్ 28 (జనం సాక్షి): రాజమండ్రిలో నిర్వహించిన ఇంటర్ స్టేట్ లెవెల్ కరాటే పోటీలలో మణుగూరు ఎక్స్ లెంట్ పాఠశాలలో చదువుతున్న సాయి అక్షిత్ విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఎక్స్ లెంట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాజమండ్రిలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు నిర్వహించిన కరాటే పోటీలలో ఎ. సాయి అక్షిత్  విజేతగా నిలిచాడు. విద్యతోపాటు ఆటపాటలలో కూడా రాణిస్తున్నారు. చదువు ఒక్కటే కాదు వాటితో పాటు ఇతర రంగాలలో కూడా పిల్లలు విజేతగా నిలవాలన్నారు. మా పాఠశాల నుంచి ఎంతో మంది వివిధ రంగాలలో చైతన్యవంతులుగా చేయటంలో ముందుంటామని తెలిపారు. సాయి అక్షిత్ విజేతగా నిలవడం మాకెంతో గర్వకారణమని అన్నారు. విజేతగా నిలిచిన సాయి అక్షిత్ ను పాఠశాల యాజమాన్యం యూసఫ్ , యాకూబ్ షరీఫ్, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.