జూరాలకు పెరుగుతున్న వరద ఉధృతి

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 9 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీటి ఉధృతి పెరిగింది. 10,448 క్యూసెక్కుల నీరు చేరడంతో జూరాల నీటిమట్టం 317.35 అడుగులకు పెరిగింది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు కాగా వరదనీటి చేరికతో ప్రాజెక్టుతో నిండుకుండలా మారింది