జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద నీరు

egvzg4u8మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు.. వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. రోజు రోజుకు వరదనీరు పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటక రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో.. నారాయణ పూర్ జలాశయం నుంచి దాదాపు పది వేల క్యూసెక్కుల నీరును.. జూరాల ప్రాజెక్టుకు వదిలారు. ఇలాగే మరికొన్ని రోజులు వర్షాలు పడితే.. ప్రాజెక్టులు నిండుతాయని అధికారులు చెపుతున్నారు.