టిఆర్ఎస్ నేతల కు విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదు

రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సత్యం
జనం సాక్షి జూన్ 24 మోమిన్ పేట
వికారాబాద్ ప్రాంతానికి అన్ని రకాల అభివృద్ధి పరచడం టిఆర్ఎస్ పార్టీకే సాధ్యమని కోటపల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యం పేర్కొన్నారు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రతినిత్యం ప్రజాసేవలో ప్రజల మధ్యలో కలుపుతూ వాడవాడలా పల్లె పల్లె తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే నాయకుడు మెతుకు ఆనంద్ అని అన్నారు ఇలాంటి నాయకుని పై కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలకు దిగడం భావ్యం కాదని ఆయన అన్నారు గతంలో పాలించిన ఎమ్మెల్యే లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా హైదరాబాదు లోనే ఉండేవారని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తున్న ఇలాంటి నాయకుడిని ప్రజలు ఎన్నటికి మరువరాని మరోసారి కూడా ఆదరిస్తారని ఆయన అన్నారు ఇకనైనా కాంగ్రెస్ బిజెపి నాయకులు విమర్శలు మాని అభివృద్ధికై సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన  సూచించారు