టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

మహబూబ్‌ నగర్‌,మే14(జ‌నం సాక్షి):  జిల్లాలోని మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామమంతా గులాబీమయం అయింది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ నరేందర్‌ రెడ్డిల సమక్షంలో గ్రామం యావత్తు కారెక్కింది. స్థానిక ప్రజా ప్రతినిధులు సహా గ్రామంలోని దాదాపు 90 శాతం మంది టీఆర్‌ఎస్‌ లో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు మద్ధతుగా నేడు టీఆర్‌ఎస్‌ లో చేరుతున్నట్లు గ్రామస్తులు ప్రకటించారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్నందు వల్లనే ప్రజలు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రి అన్నారు.