ట్రాక్టర్‌లు ఢీకొని ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌,  కొత్తకోట మండలం మిరాజ్‌పల్లి స్టేజి దగ్గర డీసీఎం ట్రాక్టర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.