ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  జిల్లాలోని పాల్వంచలో ఉన్న శ్రీనివాసనగర్‌కాలనీ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ములకలపల్లికి చెందిన గుండాల సురేందర్‌(25), చపరాలపల్లికి చెందిన నల్లమోతు శివకుమార్‌(25) ఇద్దరు పాల్వంచలోని వైన్స్‌ షాపులో పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి షాప్‌ బంద్‌ చేసిన తర్వాత బైక్‌పై ములకలపల్లి వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో శ్రీనివాసకాలనీ వద్ద ఎదురుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ వీళ్ల బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.