ట్రావెల్స్ బస్సులో మంటలు

yoc84oyyమహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూరు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్లో మంటలు వచ్చిన వెంబడే ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడంతో 3 గంటలపాటు ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.