ట్రావెల్స్ బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు

 రంగారెడ్డి : ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న మురళీకృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఏపీ 28 డీ 4844 నెంబర్ గల రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి వద్ద బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.