డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో సురేశ్, ఎంపిపి జ్యోతి మధుబాబు

పల్లె ప్రగతి లో ప్రజా ప్రతినిధులు   అధికారులు భాగస్వాములు కావాలి: జిల్లా పరిషత్ సీఈఓ జి సురేష్ కుమార్

 నడిగూడెం, జనంసాక్షి:   ఐదో విడత పల్లె ప్రగతి లో భాగంగా నడిగూడెం మండలం లో  జిల్లా పరిషత్ సీఈఓ జి సురేష్ కుమార్   ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు తో  కలిసి నడిగూడెం మండలంలోని బృందావనపురం గోపాలపురం నడిగూడెం  గ్రామాల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు కలిసి  ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని  దిగ్విజయం చేయాలని గతంలో అసంపూర్తిగా మిగిలి  ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని వీధుల్లో చెత్త లేకుండా చూడాలని చెత్త వేరు చేయు విధానం  మెరుగుపరుచుకోవాలని సూచించారు     వివిధ గ్రామాలలో నర్సరీలను పల్లె ప్రకృతి వనాలను వైకుంఠ ద్వారాలను    పరిశీలించి ప్రతి ఒక్కరూ మొక్కలు బ్రతికించు కోవాల్సిన   అవసరం ఉందని దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో వారి వెంట ఎంపీడీవో  ఎం ఎర్రయ్య ఎంపీవో లింగారెడ్డి సూపర్డెంట్ ఇమామ్ వివిధ గ్రామాల సర్పంచులు గడ్డం  నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, గండమళ్ళ స్వరూపా వెంకన్న, ఎంపిటిసి గోలి  సునీత వెంకన్న, కార్యదర్శులు రాంబాబు విజయ, నరసింహారావు  తదితరులు పాల్గొన్నారు