డీలర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే.

మర్పల్లి నవంబర్ 07 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలో గురువారం రోజున రేషన్ డీలర్ కావలి ప్రభాకర్ గుండెపోటుతో మరణించారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం రోజున  మృతుని ఇంటికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంటా జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గుప్తా, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.