తహాసిల్దార్ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేత: ఎస్ ఎఫ్ ఐ.

– విద్యార్థుల సమస్యల పై నేరుగా కలవచ్చు తహసిల్దార్…

బూర్గంపహడ్ నవంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో ఎస్ ఎఫ్ ఐ విద్యార్థీ విభాగం నాయకులు సందీప్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ గా తరలి తహసిల్దార్ భగవాన్ రెడ్డి కి విద్యార్థుల ఆదాయ, కుల ధ్రువీకర పత్రాలు సత్వరమే పొందే విధంగా వుండాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థికి చెందిన ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలు పెండింగ్ లో లేవని ఎవరైనా విద్యార్థులు తమ ఆధాయ, కుల ధ్రువీకరణ, పలు పత్రాలు అత్యవసరం ఉన్నా, ఏదైనా సమస్య ఉంటే వెంటనే నేరుగా కలిసి తెలియజేస్తే, తమ సమస్య పరిష్కారం అయ్యే దిశగా వెంటనే కృషి చేస్తామని సానుకూలంగా స్పందించారు. విద్యార్థీనీ, విద్యార్థులకు ఎస్ ఎఫ్ ఐ విభాగానికి వారికి తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంట ఆర్ ఐ అక్బర్ ఉన్నారు.