తాతలు తండ్రులు ఉండే సరిపోదు..

విజయ్‌ వ్యాఖ్యలకు బండ్ల గణెళిశ్‌ కౌంటర్‌ ట్వీట్‌
ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణెళిష్‌ ఎప్పుడూ ఏదో మాట్లాడడం విమర్శలకు గురవుతూనే ఉంటాడు. గతంలో పూరి జగన్నాథ్‌తో చివాట్లు తిన్నాడు. తాజాగా చేసిన చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటించిన తాజా చిత్రం ’లైగర్‌’ పూరి జగన్నాథ్‌ దర్శకుడు ఇద్దరికీ ఇది మొదటి పాన్‌ ఇండియా సినిమా. అయితే, ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ హైదరాబాద్‌ సుదర్శన్‌ 35 ఎంఎంలో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో విజయ్‌ దేవరకొండ భారీ కటౌట్‌ పెట్టి దానికి పూలమాల వేసి పాలాభిషేకం చేసి భారీ స్థాయిలో హడావిడి చేశారు. అటు సోషల్‌ విూడియానూ ’లైగర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేశారు. దాంతో అభిమానుల హడావిడి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన విజయ్‌.. అదిరిపోయే మాస్‌ స్పీచ్‌ ఇచ్చాడు. ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత మాట్లాడిన విజయ్‌..’విూకు మా అయ్యా తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్‌ అయ్యి రెండేళ్లు అయితుంది. ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునేది కాదు. అయినా ట్రైలర్‌కు ఈ రచ్చ ఏందిరా నాయన..’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, విజయ్‌ టాలీవుడ్‌లో మెగా హీరోలను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడని కొందరు అభిమానులు సోషల్‌ విూడియా ద్వారా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణెళిశ్‌ దీనికి కౌంటర్‌ ఇచ్చినట్లు అనిపిస్తోంది. ’తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు, టాలెంట్‌ కూడా ఉండాలి. ఎన్టీఆర్‌లా, మహేశ్‌బాబులా, రామ్‌చరణ్‌లా, ప్రభాస్‌లా.. గుర్తుపెట్టుకో బ్రదర్‌’.. అని బండ్ల ట్వీట్‌ చేశాడు. అయితే
కొందరు విజయ్‌కే బండ్ల ఈ కౌంటర్‌ ఇచ్చినట్లు ఉందని అనుకుంటున్నారు. మరి దీనిపై రౌడీ హీరో ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.