తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఎవరిదారి వారిదే:ఎంపీ గుత్తా

నల్గొండ: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజాభీష్టం మేరకు ఎవరిదారి వారు చూసుకుంటామని ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి నల్గోండలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీని బతికించుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు సైతం ఆశించమని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన కేంద్రమంద్రి వర్గ విస్తరణలో సహాయ మంత్రిత్వ శాఖల కేటాయింపు ద్వారా తెలంగాణ ప్రాంతంపై వివక్ష చూపారని మండిపడ్డారు. సాగర్‌ ఎడమ కాలువకు రబీలో సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.