తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షునికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

సుభాష్ యాదవ్, దివాకర్.

మర్పల్లి, నవంబర్ 16 (జనంసాక్షి) బుధవారం రోజున తెలంగాణ తెలుగు దేశం పార్టీ నూతన అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ను  చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు జి. సుభాష్ యాదవ్, మరియు వికారాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పి. దివాకర్  ఎన్టీఆర్ భవన్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే 2023 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి, బంటారం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు జి. శేఖర్ యాదవ్, నర్సములు, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఏస్.టి. సెల్ ప్రధాన కార్యదర్శి పాండు నాయక్, రవి, పాపిరెడ్డి, కొప్పుల ప్రభు, ప్రేమ్ కుమార్, వేంకటేశం, తదితరులు పాల్గొన్నారు.