త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి భవానీని సన్మానించిన రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్

జగదేవ్ పూర్, ఆగస్టు 23 జనం సాక్షి :
జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి  దూలిమిట్ట భవానీని జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్  సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన భవానీ త్రిబుల్ ఐటీకి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో విద్యార్థి భవానీ ఉన్నతమైన చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల రజక సంఘం గౌరవాధ్యక్షులు అక్కారం నర్సింలు ఉపాధ్యక్షులు రాచకొండ యాదగిరి వడ్లకొండ శ్రీనివాస్  కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య  నాయకులు కంచర్ల స్వామి కరుణాకర్ మనోహర్ మెతుకు నర్సింలు చంద్రం తదితరులు పాల్గొన్నారు.