త్రిశూల రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

నల్గొండ: భువనగిరి పారిశ్రామికవాడలోని త్రిశూల రసాయన పరిశ్రమలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. డబ్బాల్లో రసాయనాలే నింపుతుండగా ప్రమాదం జరిగినట్లు సిబ్బంది తెలియజేశారు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.