త్వరలోనే అందుబాటులోకి ఇళ్లు

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): పేదలకు రెండు పడక గదుల సొంతిటి కల నెరవేర్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఎంతో వ్యయప్రయాసల కోర్చి విజయవంతంగా నిర్మిస్తున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు. అనేగక గ్రామాల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆయా గ్రామాలలో డబుల్‌ బెడ్‌రూంలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇల్లెందు మండల కేంద్రంలో చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు. వివిధ గ్రామాలలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, కేవలం రహదారులు, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం వంటి పనులు మాత్రమే అసంపూర్తిగా ఉన్నాయని అధికారులు తెలిపారు.