త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గములో పర్యటించనున్న రాష్ట్ర ఐటి  మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్

=
హుజూర్ నగర్ జూన్ 7 (జనం సాక్షి): త్వరలో హుజూర్ నగర్ నియోజకవర్గములో రాష్ట్ర ఐటి  మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటిస్తారని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు శానంపూడి  సైదిరెడ్డి నిన్న తెలంగాణ రాష్ట్ర ఐటి మునిసిపల్ శాఖ మాత్యులు మంత్రివర్యులు కేటీఆర్ ని కలిసి హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. హుజూర్ నగర్, నెరేడుచెర్ల అభివృద్ది పనుల కొరకు , ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి, పది కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు. నియోజక వర్గం లో రాకెట్ వేగంతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వంని ఒప్పించి తీసుకొస్తున్న నిధులను చూసి అటు నియోజక వర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు.