త్వరలో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ
హైదరాబాద్: తెలంగాణ ఉత్యమం సమాంతరంగా, సమన్వయంతో ముందుకు సాగాలి అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడేవారు ఒకరి నొకరు విమర్శించడం మానుకోవాలని ఆయన కోరారు.
ఉత్తరమిచ్చి ఉద్యమంలో పాల్గొనమంటే ఎలా?
టీడీపీ నేతలు తెలంగాణకు వ్యతిరేకం కాదని ఉత్తరమిచ్చి ఉద్యమంలో పాల్గొనకపోతే ఎలా అని కోదండరాం ప్రశ్నించారు టీడీపీ నేతలు ఉద్యమంలో పాల్గొనకుంటే ఊరుకునేదేలేదని అయన అన్నారు.