దత్త గిరిలో కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం

హాజరైన కాశీ శ్రీ జగద్గురు
జహీరాబాద్ నవంబర్ 09 (జనం సాక్షి) : జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్లోని  శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమ లో బుదవారం కార్తీక మాస ఉత్సవలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిటీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి దీపారాధన మహోత్సవం కరపత్రాలు అవిష్కరిచిన్న  కాశీ పీఠం జగద్గురు  శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు డాక్టర్ మల్లికార్జున విశ్వారాద్య శివాచార్య మహా స్వామీజీ హాజరయ్యారు. బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో జరిగే శతకోటి జపయజ్ఞ కార్యక్రమ కరపత్రములను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారికి అల్లిపుర్ శ్రీ దత్తగిరి  మహారాజ్ ఆశ్రమ కమిటీ వారు ఘనంగా సన్మానించారు.అంతకు ముందు ఆశ్రమంలో రుద్రాభిషేకం, అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, మహా మంగళారం భజన సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బర్దిపుర్ ఆశ్రమ ఉత్తరాధికారి డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్, రంజోల్ రాజయోగ ఆశ్రమ పీఠాధిపతి రాచయ్య స్వామి, అల్లాడి సాయిరాం,రవి కుమార్, అనిల్ కుమార్,శ్రీ దత్తగిరి కలని భక్తులు పాల్గొన్నారు.